న్యూఢిల్లీ: జాట్ల రిజర్వేషన్ ఆందోళనల నేపథ్యంలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మునాక్ కాలువను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకోవడంతో త్వరలోనే ఢిల్లీకి తాగునీటి సమస్యలు తీరిపోతాయని తెలిపారు. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న జాట్లు ఢిల్లీ కీలక మంచినీటి వనరైన మునాక్ కాలువను నిర్భందించారు. దీంతో తాగునీరు అందక ఢిల్లీ వాసులు అల్లాడుతున్న సంగతి తెలిసిందే.
దీనిపై ఓవైపు కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో పరిష్కారాన్ని కోసం ప్రయత్నించకుండా.. చేతులు కట్టుకొని కూర్చోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలోనే జాట్లు నిర్బంధించిన మునాక్ కాలువను ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకోవడం.. తాగునీటి సరఫరాకు లైన్ క్లియర్ చేయడంతో ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రకటించారు. ఇది ఢిల్లీవాసులకు శుభవార్త అని ఆయన చెప్పారు. అయితే ఈ కాలువ లైనింగ్ దెబ్బతిందో? లేదో పరీక్షించి వీలైనంత త్వరగా ప్రజలకు నీటిని అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన తాగునీటి సమస్య కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే.
ట్విట్టర్లో గుడ్న్యూస్ చెప్పిన కేజ్రీవాల్!
Published Mon, Feb 22 2016 7:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement