రేపు రాజీవ్‌కుమార్‌ను విచారించనున్న సీబీఐ

CBI To Question Kolkata Police Commissioner Rajeev Kumar - Sakshi

న్యూఢిల్లీ/కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్‌ కేసులో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను ఈ నెల 9వ తేదీన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారించనున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపినట్లు తెలిపింది. ఇటీవల కోల్‌కతాలోని రాజీవ్‌కుమార్‌ నివాసంలో సోదాలకు వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు నిర్బంధించడం, సీఎం మమతాబెనర్జీ ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్‌ ఘోష్‌ను కూడా ఈ నెల 10వ తేదీన షిల్లాంగ్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ కోరింది.   (శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top