కోళ్లకు టికెట్‌ లేదా.. అయితే ఫైన్‌ కట్టు ! | Bus Ticket Fine For Three Hens in Karnataka | Sakshi
Sakshi News home page

కోళ్లకు టికెట్‌ లేదా.. అయితే ఫైన్‌ కట్టు !

Apr 26 2019 11:10 AM | Updated on Apr 26 2019 11:10 AM

Bus Ticket Fine For Three Hens in Karnataka - Sakshi

మూడు కోళ్లకు రూ. 500 జరిమానా

బొమ్మనహళ్లి : కోళ్లకు టికెట్‌ తీసుకోలేదని జరిమానా విధించిన ఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం ఉదయం ఓ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని కోడు నుంచి మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. నిజాయితీగా టికెట్‌ తీసుకున్నాడు. ఇంతలో కొంత దూరం ప్రయాణం అనంతరం తనిఖీ బృందం వచ్చి టికెట్లు తనిఖీ చేస్తుండగా కోళ్లకు టికెట్‌ తీసుకోలేదని గుర్తించి సదరు ప్రయాణికుడికి రూ. 500 జరిమానా విధించారు. కేఎస్‌ఆర్టీసీలో ప్రాణులు, ఇతర పక్షులను తీసుకువెళ్లే సమయంలో తప్పకుండా అర టికెట్‌ తీసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో విషయం తెలియని వ్యక్తి జరిమానా కట్టి కోళను వెంట తెచ్చుకున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement