టోల్‌ అడిగినందుకు తోలు తీశారు | Attendant thrashed for demanding toll tax | Sakshi
Sakshi News home page

టోల్‌ అడిగినందుకు తోలు తీశారు

Feb 12 2017 2:50 PM | Updated on Aug 28 2018 4:00 PM

టోల్‌ అడిగినందుకు తోలు తీశారు - Sakshi

టోల్‌ అడిగినందుకు తోలు తీశారు

టోల్‌ చార్జీని చెల్లించాలని అడిగినందుకు అందులో పనిచేసే వ్యక్తిని చితక్కొట్టారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయింది. చూసిన వారి ఒళ్లు జలదరించేలా టోల్‌ వసూలు చేసే సహాయకుడిపై ముష్టిఘాతాలకు దిగారు.

గుర్గాం: టోల్‌ చార్జీని చెల్లించాలని అడిగినందుకు అందులో పనిచేసే వ్యక్తిని చితక్కొట్టారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయింది. చూసిన వారి ఒళ్లు జలదరించేలా టోల్‌ వసూలు చేసే సహాయకుడిపై ముష్టిఘాతాలకు దిగారు. వివరాల్లోకి వెళితే.. గుర్గామ్‌ బ్లాక్‌ సమితి మాజీ చైర్మన్‌ హోషియార్‌ సింగ్‌ శనివారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో ఓ కారులో వెళుతూ ఖైద్కీ దౌలా ప్లాజాను సమీపించారు.

ఆ సమయంలో ఆయనను టోల్‌ చెల్లించాలని అక్షయ్‌ అనే యువకుడు అడిగాడు. దీంతో తననే టోల్‌ చేయమంటావా అని ప్రశ్నిస్తూ ఒకేసారి అనూహ్యంగా దాడికి దిగారు. హోషియార్‌ ఆగ్రహంతో కారులో నుంచి వేగంగా దిగి అక్షయ్‌పై దాడి చేశాడు. అనంతరం అందులోని కంప్యూటర్‌, ఇతర సామాను పగులగొట్టారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ దొరికిన నేపథ్యంలో దాని ఆధారంగా హోషియార్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement