భారత్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా


అలీగఢ్: ప్రభావవంతమైన ఔషధాలకు కూడా నిరోధకత కలిగిన.. ప్రమాదకరమైన ‘ఎన్‌డీఎం-4’ రకం బ్యాక్టీరియాను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో గుర్తించారు. ఈ-కొలి తరహాకు చెందిన వాటిలో అత్యంత ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఇప్పటివరకూ కామెరూన్, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో మాత్రమే కనిపించింది. భారత్‌లో దీనిని గుర్తించడం ఇదే మొదటిసారని వర్సిటీ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త అసద్ ఉల్లాఖాన్ తెలిపారు. 2009లో ఇదే తరహాకు చెందిన ‘ఎన్‌డీఎం-1’ రకం బ్యాక్టీరియాను గుర్తించామన్నారు. కానీ అంతకన్నా ప్రమాదకరమైన ఈ ‘ఎన్‌డీఎం-4’.. అలీగఢ్‌లోని మెడికల్ కాలేజీలో మురుగునీటిని విశ్లేషిస్తుండగా బయటపడిందని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top