ఓటేస్తే చికెన్‌పై రూ.50 రాయితీ

50rs Offer on Vote Right in Tamil Nadu - Sakshi

టీ.నగర్‌: పోలింగ్‌ రోజున ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తికి చికెన్‌ ధరలో రూ.50 రాయితీ అందజేస్తూ చెన్నై ఐనావరంలోని ఒక దుకాణ యజమాని ప్రకటించాడు. ఎన్నికల కమిషన్‌ పార్లమెంటు ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌కు ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. అలాగే పలువురు 100 శాతం పోలింగ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇలా ఉండగా చెన్నై ఐనావరం మార్కెట్‌ సమీపంలోని చికెన్‌ సెంటర్‌ యజమాని మురళీబాబు వంద శాతం పోలింగ్‌పై అవగాహన పెంచేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. పోలింగ్‌ జరిగే 18వ తేదీన ఓటేసి వచ్చిన ఓటరుకు కోడిమాంసంలో ప్రత్యేక రాయితీ ప్రకటించాడు. ఓటేసినట్లు సిరాతో ఉన్న గుర్తును చూపితే కోడి మాంసం కిలో ధరలో రూ.50 తగ్గింపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈయన నిర్ణయానికి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top