ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదుల హతం

3 terrorists killed in an encounter with security forces in Baramula - Sakshi

శ్రీనగర్‌ : భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బిన్నర్‌లో భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భధ్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గరు తీవ్రవాదులు మృతి చెందారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సంఘటన స్థలంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top