అమలాపురం టు షిర్డీ | Swetha Basu Prasad About Mixer Potlam Telugu Movie | Sakshi
Sakshi News home page

అమలాపురం టు షిర్డీ

May 15 2017 11:44 PM | Updated on Sep 5 2017 11:13 AM

అమలాపురం టు షిర్డీ

అమలాపురం టు షిర్డీ

సుందరి ట్రావెల్స్‌ చాలా ఫేమస్‌. అమలాపురం టు షిర్డీ వెళ్లే ఈ ట్రావెల్స్‌ బస్సులో విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు ప్రయాణం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ.

సుందరి ట్రావెల్స్‌ చాలా ఫేమస్‌. అమలాపురం టు షిర్డీ వెళ్లే ఈ ట్రావెల్స్‌ బస్సులో విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు ప్రయాణం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఆ కథల సమాహారంతో రూపొందిన చిత్రం ‘మిక్సర్‌ పొట్లం’. నటుడు భానుచందర్‌ తనయుడు జయంత్, శ్వేతాబసు ప్రసాద్, గీతాంజలి హీరో హీరోయిన్లు.

 ఎం.వి. సతీష్‌ కుమార్‌ దర్శకత్వంలో కలపటపు లక్ష్మీప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్‌ షోను కె.భాగ్యరాజా, భానుచందర్, ఎస్పీబీ, వెన్నెలకంటి తదితరులు వీక్షించారు. ‘‘శ్వేతాబసు నటన హైలెట్‌. ప్రముఖులందరూ ప్రీమియర్‌ షో చూసి, అభినందించడం సంతోషం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement