డిజిటల్‌ ఎంట్రీ

Sai Pallavi and Prakash Raj in Vetrimaaran next - Sakshi

‘లస్ట్‌స్టోరీస్‌’ ఆంథాలజీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌. అదే ‘లస్ట్‌స్టోరీస్‌’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది. తాజాగా కోలీవుడ్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ ఆంథాలజీతో అడుగుపెట్టనుంది. నలుగురు దర్శకులు నాలుగు కథలను కలిపి ఓ చిత్రంగా మలచడమే ఆంథాలజీ. ఈ తమిళ ఆంథాలజీ పరువు హత్యలు ఆధారంగా ఉంటాయని తెలిసింది.

తమిⶠ దర్శకులు గౌతమ్‌ మీనన్, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్, వెట్రిమారన్‌ ఈ ఆంథాలజీను తెరకెక్కిస్తారట. వెట్రిమారన్‌ రూపొందించే భాగంలో సాయిపల్లవి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. కాగా సాయి పల్లవికి తొలి డిజిటల్‌ ఎంట్రీ ఇదే కానుంది. సాయిపల్లవి, ప్రకాశ్‌ రాజ్‌ తండ్రీకూతుళ్లుగా నటించనున్న ఈ ఆంథాలజీ డిసెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేశ్‌ శివన్‌ తన భాగానికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేశారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top