మరో మైల్‌స్టోన్‌ దాటిన ‘రంగస్థలం’ | Rangasthalam Crossed Three And Half Million In US | Sakshi
Sakshi News home page

May 2 2018 12:24 PM | Updated on May 2 2018 5:10 PM

Rangasthalam Crossed Three And Half Million In US - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్‌ డ్రామా రంగస్థలం. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు నటుడిగా రామ్‌ చరణ్‌ స్థాయిని పెంచింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప‍్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించిన రంగస్థలం ఇప్పటికీ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఓవర్‌సీస్‌లో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది.

ఇప్పటికే అమెరికాలో చాలా ప్రాంతాల్లో ప్రదర్శితమవుతున్న రంగస్థలం 3.5 మిలియన్‌ డాలర్ల (23 కోట్ల)కు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే నాన్‌ బాహుబలి రికార్డ్‌లను చెరిపేస్తూ దూసుకుపోతున్న రంగస్థలం ముందు ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు ఫ‍్యాన్స్‌. రామ్‌ చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్‌ రాజ్‌, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement