'రాజు గాడు'కి వింత జబ్బు

Raju gadu - Sakshi

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. సంజనా రెడ్డి అనే కొత్త దర్శకురాలు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరో ఓ వింత జబ్బుతో బాధపడుతుంటాడట. ఇటీవల భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు చిత్రాలు ఇదే తరహా కథా కథనాలతో తెరకెక్కి మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అదే బాటలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

రాజు గాడు సినిమాలో హీరో బుద్ధి అని ఆదీనంలో ఉండదు. తనకు తెలియకుండానే తాను దొంగతనం చేసేస్తుంటాడు. ఇలాంటి వింత వ్యాధి కారణంగా హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నదే సినిమా కథ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top