నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది

Prathi Roju Panduga sucess meet - Sakshi

– సుకుమార్‌

‘‘యంగ్‌∙ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలను రూపొందించే మారుతి, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి భావోద్వేగాలకు సంబంధించిన కథను అద్భుతంగా తీశారు’’ అని సుకుమార్‌ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్‌ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్‌ మాట్లాడుతూ – ‘‘సినిమా మొత్తం బాధ అనే ఎమోషన్‌ ఉన్నా ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తున్నారని నాతో ‘బన్నీ’ వాస్‌ అన్నాడు. సినిమా చూశాక అతను చెప్పింది కరెక్టే కదా అనిపించింది. ఆద్యంతం నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది ఈ సినిమా.

సాయితేజ్‌కి మేనమామ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘కొన్ని ఫ్లాప్స్‌ ఎదురవగానే నా కెరీర్‌ అయిపోయిందని చాలామంది జోక్స్‌ వేసుకున్నారు. ఈ సినిమా రూపంలో మంచి హిట్‌ దక్కింది. నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ఇచ్చారు మారుతి’’ అన్నారు సాయితేజ్‌. ‘‘నిర్మాతగా నేను ఈస్థాయిలో ఉండటానికి ‘దిల్‌’రాజుగారు, అల్లు అరవింద్‌గారితోపాటు సుకుమార్‌గారు కూడా ఓ కారణం. నన్ను నిర్మాతను చేయడానికి ‘100% లవ్‌’ తీశారు’’ అన్నారు ‘బన్నీ’ వాస్‌. ‘‘థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన  చూస్తుంటే వాళ్లను ఇంకా నవ్వించాలనే కసి పెరిగింది. సుకుమార్‌గారు మా సినిమాని అభినందించడం హ్యాపీ’’ అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో తమన్, రాశీఖన్నా, రావు రమేశ్,  పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top