సగం పారితోషికం ఇచ్చేయాలి | Paramapadham Vilayattu Pre Release Event | Sakshi
Sakshi News home page

సగం పారితోషికం ఇచ్చేయాలి

Feb 23 2020 2:40 AM | Updated on Feb 23 2020 2:40 AM

Paramapadham Vilayattu Pre Release Event - Sakshi

‘‘స్టార్‌ హీరోలతో తీసే సినిమాల ప్రచార కార్యక్రమాలకు హీరోయిన్లు రాకపోయినా ఫర్వాలేదు. హీరోని బట్టి ప్రమోషన్‌ వచ్చేస్తుంది. అయితే కథానాయికను నమ్మి లేడీ ఓరియంటెడ్‌ సినిమా తీసినప్పుడు దానికి కావల్సినంత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ఆ హీరోయిన్‌దే’’ అన్నారు తమిళ నిర్మాత టి. శివ. త్రిష నటించిన తమిళ చిత్రం ‘పరమపద విళయాట్టు’కి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఆ కార్యక్రమానికి త్రిష హాజరు కాకపోవడంతో టి. శివ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నూతన దర్శకుడు తిరుజ్ఞానం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న టి. శివ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా దర్శకుడు తిరుజ్ఞానం నా స్నేహితుడు. ఎంతో కష్టపడి తీశాడు. నేనింకా సినిమా చూడలేదు. కానీ రషెస్‌ చూసినవాళ్లందరూ బాగుందన్నారు. హీరోలు లేకుండా తను ఈ సినిమా చేశాడు. అందుకని ప్రమోషన్‌ చేయాల్సిన బాధ్యత హీరోయిన్‌ మీద ఉంది. కానీ రాలేదు. ఒకవేళ ఈ కార్యక్రమానికి రాకపోవడానికి ఆమెకు విలువైన కారణం ఏదైనా ఉండి ఉండొచ్చు. కానీ 28లోపు జరిగే ప్రమోషనల్‌ కార్యక్రమాలకు తను కచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఈ సినిమాకి తీసుకున్న పారితోషికంలో కొంత భాగం వెనక్కి ఇచ్చేయాలని నిర్మాతల సంఘం తరఫున హెచ్చరిస్తున్నా. ఇది ఇతర స్టార్స్‌కి కూడా కనువిప్పులా ఉంటుంది’’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement