డైరెక్టర్‌గా మారిన యువ హీరో

Naga Shourya Directed A Short Film Bhoomi - Sakshi

ఛలో సినిమాతో సక్సెస్‌ సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్నారు నాగశౌర్య. ప్రస్తుతం ఈ కుర్ర హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే కణం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. త్వరలోనే అమ్మమ్మగారిల్లు సినిమాతో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో మెగా ఫోన్‌ పట్టుకున్నారు. 

అయితే ఇది ఒక షార్ట్‌ఫిలిమ్‌ కోసం. రేపు( ఆదివారం) మాతృ దినోత్సవ సందర్భంగా మాతృ మూర్తులందరికి అంకితం చేస్తూ... భూమి అనే షార్ట్‌ ఫిలిమ్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ఈ లఘుచిత్రాన్ని నాగశౌర్య డైరెక్ట్‌ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top