డైరెక్టర్గా మారిన యువ హీరో
ఛలో సినిమాతో సక్సెస్ సాధించి ఫుల్ జోష్లో ఉన్నారు నాగశౌర్య. ప్రస్తుతం ఈ కుర్ర హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే కణం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. త్వరలోనే అమ్మమ్మగారిల్లు సినిమాతో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో మెగా ఫోన్ పట్టుకున్నారు.
అయితే ఇది ఒక షార్ట్ఫిలిమ్ కోసం. రేపు( ఆదివారం) మాతృ దినోత్సవ సందర్భంగా మాతృ మూర్తులందరికి అంకితం చేస్తూ... భూమి అనే షార్ట్ ఫిలిమ్ను రిలీజ్ చేయనున్నారు. ఈ లఘుచిత్రాన్ని నాగశౌర్య డైరెక్ట్ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు.
Strong women, strong mothers define the strength of our nation.
Saluting all mothers this #MothersDay.#Bhoomi is our tribute to all the women on this day.
Yours,
Naga Shaurya.Releasing tomorrow morning at 10AM @https://t.co/6i1mAPmOuC pic.twitter.com/BG0WbIrRJ6
— Naga Shaurya (@IamNagashaurya) May 12, 2018