దొంగలున్నారు జాగ్రత్త!

Bigg Boss 3 Telugu Captaincy Task In 3rd Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో దొంగలు పడ్డారు.. అదేంటీ అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా?. దొంగలు అంటే నిజమైన దొంగలు కాదులేండీ!. టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌లో కొందరు దొంగలుగా, మరికొందరు పోలీసులుగా మారారు. ఇక ఈ దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్‌లో.. హౌస్‌మేట్స్‌ తమ వద్ద ఉన్న డబ్బులు జాగ్రత్తగా చూసుకోవాలని టాస్క్‌ ఇచ్చినట్లు కనబడుతోంది. మొన్నటి వరకు గొడవలు, అలకలు, అరుపులు చూడగా.. నేడు ఓ టాస్క్‌తో హౌస్‌మేట్స్‌ మనముందుకు రానున్నారు. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనుండగా.. శ్రీముఖి మాత్రం కిలాడీలా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. 

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా.. బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్‌ను ఇచ్చాడు. ఇంట్లో కొందరు దొంగలు పడ్డారని,  జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారే కెప్టెన్సీ అవుతారని బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఇంటి సభ్యులంతా తమ డబ్బును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ టాస్క్‌లో భాగంగానే వరుణ్‌ సందేశ్‌ను మాటల్లో పెట్టి అతని వద్ద ఉన్న డబ్బును శ్రీముఖి కాజేసింది. నేటి ఎపిసోడ్‌కు సంబంధించి రిలీజ్‌ చేసిన ఈ ప్రోమోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి ఇలాంటి దొంగతనాలు, మాయమాటలు హౌస్‌లో ఇంకెన్ని జరుగుతాయో చూడాలి. (పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా)

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top