త్వరలో నేరుగా గన్నవరం నుంచి దుబాయ్‌కు! | Balashowry Met Civil Aviation Minister hardeep singh puri On Thursday | Sakshi
Sakshi News home page

త్వరలో నేరుగా గన్నవరం నుంచి దుబాయ్‌కు!

Oct 31 2019 5:10 PM | Updated on Oct 31 2019 5:23 PM

Balashowry Met Civil Aviation Minister hardeep singh puri On Thursday - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బాలశౌరి గురువారం సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ ఖోరాతో భేటీ అయ్యారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనల మేరకు ప్రదీప్‌ సింగ్‌ను బాలశౌరి కలిశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారానికి రెండు సార్లు  విజయవాడ- హైదరాబాద్-దుబాయ్ ల మధ్య ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులు నడపాలనిఘీ సందర్భంగా ప్రదీప్‌ సింగ్‌ను బాలశౌరి కోరారు. బాలశౌరి విజ్ఞప్తి మేరకు.. ఎయిర్‌ ఇండియా సర్వీసులు నడపడానికి ప్రదీప్‌ సింగ్‌ సానుకూలత వ్యక్తం చేశారు.

ఇందుకోసం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో త్వరతగతిన పర్మినెంట్ బిల్డింగ్లు, ఏరో బ్రిఢ్జిల పనులను  ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గన్నవరంకి ఎయిర్ కనెక్టివిటీ అంశంపై చర్చించానంటూ హర్దీప్‌ సింగ్‌ పూరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. త్వరలోనే విజయవాడ-దుబాయ్ కి ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని కేంద్రం హామీ ఇవ్వడం ఆనందంగా వుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement