'క్విడ్ ప్రోకో కేసులో వాయిదాలకు మినహాయించండి' | YS Jagan mohan reddy seeks court permission for exemption in quid-pro-quo case | Sakshi
Sakshi News home page

'క్విడ్ ప్రోకో కేసులో వాయిదాలకు మినహాయించండి'

Dec 3 2013 12:24 PM | Updated on Jul 25 2018 4:09 PM

క్విడ్ ప్రోకో కేసులో రెగ్యులర్ వాయిదాలకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టును కోరారు.

క్విడ్ ప్రోకో కేసులో రెగ్యులర్ వాయిదాలకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీబీఐ కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు మంగళవారం నాంపల్లిలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారు.

 

అందుకు ఆయనకు అనుమతించాలని వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీనిపై సమాధానం ఇవ్వాలని నాంపల్లిలోని కోర్టు మంగళవారం సీబీఐకు నోటీసులు జారీ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement