ఉత్తర కొరియా వర్సెస్‌ అమెరికా కొత్త లొల్లి | us cancelled informal meeting with north korea | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా వర్సెస్‌ అమెరికా కొత్త లొల్లి

Feb 27 2017 3:12 PM | Updated on Aug 24 2018 7:24 PM

ఉత్తర కొరియా వర్సెస్‌ అమెరికా కొత్త లొల్లి - Sakshi

ఉత్తర కొరియా వర్సెస్‌ అమెరికా కొత్త లొల్లి

ఉత్తర కొరియా అమెరికాల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. ఆ రెండు దేశాల మధ్య జరగాల్సిన అనధికారిక చర్చలను అమెరికా అధ్యక్షుడు పరిపాలన వర్గం రద్దు చేసింది.

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అమెరికాల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. ఆ రెండు దేశాల మధ్య జరగాల్సిన అనధికారిక చర్చలను అమెరికా అధ్యక్షుడు పరిపాలన వర్గం రద్దు చేసింది. ఇందుకు అమెరికానే కారణం అయింది. చర్చలు జరిపేందుకు రావాల్సిన ఉత్తర కొరియా బృంద వీసాలకు ఆమోదం తెలిపే ప్రక్రియను ఉపసంహరించుకోవడంతో తాజాగా అమెరికాలో ఉత్తర కొరియా అధికార బృందం అడుగుపెట్టలేని పరిస్థితి తలెత్తింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ్‌ జాన్‌ నామ్‌ మలేషియాలో హత్యకు గురి అయిన నేపథ్యంలో ఈ టూర్‌ రద్దయినట్లు తెలుస్తోంది.

ఉత్తర కొరియా తరుపున అమెరికాలో విదేశీ వ్యవహారాలు చూస్తున్న డైరెక్టర్‌ చో సన్‌ హుయి మొత్తం ఆరు గురుమంది సభ్యులతో వచ్చే వారం న్యూయార్క్‌లో అమెరికాలోని మాజీ అధికారులతో సమావేశం జరపాల్సి ఉంది. ఈలోగా వీసాలకు ఆమోదం లభించలేదని, ఇరు దేశాల మధ్య చర్చలు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయని పేర్కొంటూ ఉత్తర కొరియానుంచి అమెరికాకు బయలుదేరనున్న ఆరుగురు అభ్యర్థులకు ఈ మెయిల్‌ ద్వారా సూచించారు. కిమ్‌ జాంగ్‌ నామ్‌పై దాడికి ఉపయోగించిన వీఎక్స్‌ నెర్వ్‌ అనే మందు ప్రజాసమూహాన్ని ధ్వంసం చేయగల అతిపెద్ద వినాశిని అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా వీసాలను ఆమోదించకుండా వెనక్కి వెళ్లి సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement