‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’ | UN Court Orders Myanmar to Protect Rohingya Muslims | Sakshi
Sakshi News home page

‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’

Jan 24 2020 6:07 AM | Updated on Jan 24 2020 6:07 AM

UN Court Orders Myanmar to Protect Rohingya Muslims - Sakshi

ది హేగ్‌: మయన్మార్‌ సైన్యం దాడులతో బంగ్లాదేశ్‌ వెళ్లి తలదాచుకుంటున్న లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బాసటగా నిలిచింది. రోహింగ్యాలపై మారణకాండను ఆపేందుకు మయన్మార్‌ ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నదీ ముందుగా నాలుగు నెలలకు, ఆ తర్వాత ఆరు నెలలకోసారి నివేదిక అందించాలని ఐసీజే ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ఖవీ అహ్మద్‌ యూసఫ్‌ కోరారు. మయన్మార్‌ సైన్యం రోహింగ్యాలపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతోందని ముస్లిం దేశాల తరఫున ఐసీజేలో గాంబియా వాదించింది.

Advertisement
 
Advertisement
Advertisement