‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’ | UN Court Orders Myanmar to Protect Rohingya Muslims | Sakshi
Sakshi News home page

‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’

Jan 24 2020 6:07 AM | Updated on Jan 24 2020 6:07 AM

UN Court Orders Myanmar to Protect Rohingya Muslims - Sakshi

ది హేగ్‌: మయన్మార్‌ సైన్యం దాడులతో బంగ్లాదేశ్‌ వెళ్లి తలదాచుకుంటున్న లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బాసటగా నిలిచింది. రోహింగ్యాలపై మారణకాండను ఆపేందుకు మయన్మార్‌ ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నదీ ముందుగా నాలుగు నెలలకు, ఆ తర్వాత ఆరు నెలలకోసారి నివేదిక అందించాలని ఐసీజే ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ఖవీ అహ్మద్‌ యూసఫ్‌ కోరారు. మయన్మార్‌ సైన్యం రోహింగ్యాలపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతోందని ముస్లిం దేశాల తరఫున ఐసీజేలో గాంబియా వాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement