జపాన్లో భూకంపం: బుల్లెట్ రైళ్లు నిలిపివేత | Strong 6.0-magnitude quake hits off Japan coast; no tsunami | Sakshi
Sakshi News home page

జపాన్లో భూకంపం: బుల్లెట్ రైళ్లు నిలిపివేత

Apr 1 2016 9:23 AM | Updated on Sep 3 2017 9:01 PM

జపాన్లో భూకంపం: బుల్లెట్ రైళ్లు నిలిపివేత

జపాన్లో భూకంపం: బుల్లెట్ రైళ్లు నిలిపివేత

జపాన్ నైరుతీ తీర ప్రాంతంలోని హన్ష్ ద్వీపంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదు అయింది.

టోక్యో : జపాన్ నైరుతీ తీర ప్రాంతంలోని హన్ష్ ద్వీపంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా సునామీ వచ్చే సూచనలు లేవని స్థానిక ఉన్నతాధికారులు  వెల్లడించారని తెలిపింది.

ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్ణం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని జపాన్ వాతావరణ సంస్థ, యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థలు సంయుక్తం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ భూకంపం కారణంగా సదరు ప్రాంతంలో నడిచే బుల్లెట్ రైళ్లను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు మీడియా సంస్థ ప్రకటించింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement