ట్విటర్లో 140 పదాలే
సామాజిక మాధ్యమైన ట్విటర్లో ప్రస్తుతమున్న 140 పదాల పరిమితిని పెంచనున్నారన్న వార్తలను ఆ సంస్థ సీఈఓ జాక్ డోర్సీ తోసిపుచ్చారు.
లాస్ ఏంజెలిస్: సామాజిక మాధ్యమైన ట్విటర్లో ప్రస్తుతమున్న 140 పదాల పరిమితిని పెంచనున్నారన్న వార్తలను ఆ సంస్థ సీఈఓ జాక్ డోర్సీ తోసిపుచ్చారు. ‘ప్రస్తుతమున్న 140 పదాల పరిమితి చాలా బాగుంది. అదే కొనసాగుతుంది. దీనివల్ల సంక్షిప్తత ఉంటుంది. ఆ అనుభూతిని మేము వదులుకోబోం’ అని ఆయన ఎన్బీసీ టీవీ చానల్ నిర్వహించిన టాక్ షోలో చెప్పారు. ట్విటర్ పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. ట్విటర్లో 10వేల పదాలకు పరిమితిని పెంచనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


