20 రోజుల తర్వాత కనిపించిన కిమ్‌ | North Korea leader Kim Jong Un makes first public appearance in 20 days | Sakshi
Sakshi News home page

20 రోజుల తర్వాత కనిపించిన కిమ్‌

May 2 2020 8:21 AM | Updated on May 2 2020 2:33 PM

ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం పూర్తయిన కార్యక్రమంలో పాల్గొన్న కిమ్‌ జోంగ్‌ ఉన్ - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం పూర్తయిన కార్యక్రమంలో పాల్గొన్న కిమ్‌ జోంగ్‌ ఉన్

ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ 20రోజుల తర్వాత కనిపించారు. కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగార నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్‌ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటూ అతని సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 15 నుంచి కిమ్‌ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది.


Advertisement
 
Advertisement
Advertisement