విమానంలో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి | Sakshi
Sakshi News home page

విమానంలో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి

Published Mon, May 6 2019 7:55 AM

Fire Accident In Plane And 41 died In Russia - Sakshi

మాస్కో : అకస్మాత్తుగా విమానంలో చెలరేగిన మంటల్లో దాదాపు 41 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మాస్కో నుంచి బయల్దేరిన ఈ విమానం.. టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్‌ వల్ల నేలకు బలంగా తాకింది. దీనివల్లే విమానంలో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement