మసీదుపై బాంబుదాడి.. | bomb blast in masjid in nigeria | Sakshi
Sakshi News home page

మసీదుపై బాంబుదాడి..

Jul 17 2017 6:07 PM | Updated on Sep 5 2017 4:15 PM

నైజీరియాలోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం మైదుగురిలోని ఓ మసీదుపై జరిగిన బాంబుదాడిలో పది మంది చనిపోయారు.

అబూజ(నైజీరియా): నైజీరియాలోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం మైదుగురిలోని ఓ మసీదుపై సోమవారం జరిగిన బాంబుదాడిలో పది మంది చనిపోయారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు పదార్థాలు ధరించిన ఓ గుర్తు తెలియని మహిళ ప్రవేశించి తనను తాను పేల్చేసుకుంది.

దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులెవరనేది తెలియాల్సి ఉంది. వారంలోనే నగరంలో ఇది అయిదో దాడి కావటం గమనార్హం. ఈనెల 14వ తేదీన మహిళా ఆత్మహుతి బాంబర్‌ దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement