* కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న భారతీయుడు
* ఇరాక్లో పరిస్థితిపై ప్రధాని సమీక్ష
* భారత పౌరుల్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం: కేంద్రం
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బాగ్దాద్: ఇరాక్లోని కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకుపోరుున భారతీయుల్లో 16 మందిని ఆయూ ప్రాంతాల నుంచి బయటకు తరలించారు. మరోవైపు మోసుల్ పట్టణంలో కిడ్నాప్కు గురైన 40 మంది భారతీయుల్లో ఒకరు మిలిటెంట్ల చెర నుంచి తప్పించుకున్నారు. ఇరాక్లోని భారత పౌరుల్ని రక్షించేందుకు అన్ని తలుపులూ తడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కిడ్నాప్ అరుున వారి విషయంలో, తిక్రిత్లో చిక్కుకుపోరుున 46 మంది నర్సుల విషయంలో ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో.. సంక్షోభ పరిష్కారానికి సకల ప్రయత్నాలూ చేస్తున్నామని, ఇరాక్ అధికారులతో పాటు ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్రం పేర్కొంది. ఇరాక్లో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉన్నతస్థారుు సమీక్ష నిర్వహించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పలువురు ఉన్నతాధికారులు, భద్రత.. నిఘా విభాగాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కిడ్నాప్కు గురైన వారంతా క్షేమంగానే ఉన్నట్టు, సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
కాగా అన్బర్, బైజీ ప్రాంతాల నుంచి బయటపడిన 16 మందిని ఇరాక్ నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు.సున్నీ మిలిటెంట్ల స్వాధీనంలో ఉన్న తిక్రిత్లోని 46 మంది నర్సులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఇరాక్ నుంచి భారత్కు తిరిగి రావాలనుకుంటున్న వారికి ఆర్థిక సహాయం చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ మేరకు వీసా నిబంధనలు సడలించాలని కూడా ఇరాక్కు విజ్ఞప్తి చేసిం ది. చిక్కుకున్న భారతీయులను ముఖ్యంగా తెలంగాణ వారిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్రాన్ని కోరారు. మిలిటెంట్లపై పోరాడేందుకు తమ దళాలు ఇరాక్ వెళ్లబోవని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు.
16 మంది భారతీయుల తరలింపు
Published Sat, Jun 21 2014 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!
ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర ఫిదా
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement