జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది.
హైదరాబాద్ : జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి వైఎస్ఆర్ సీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.