grand tribute
-
కార్గిల్ వీరులకు శ్రద్ధాంజలి
చీర్యాల నారాయణ గ్లోబల్ పాఠశాల్లో కార్గిల్ విజయ్ దివస్ కీసర : మండలంలోని చీర్యాల నారాయణ గ్లోబల్ పాఠశాల్లో మంగళవారం కార్గిల్ విజయ్దివాస్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు కొవ్వత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అలర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామిడి రాంరెడ్డి మాట్లాడుతూ దేశ సేవ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రుదేశాల నుంచి మన దేశాన్ని కాపాడుతున్న గొప్ప వ్యక్తులు జవాన్లేనన్నారు. కార్గిల్లో వీర మరణం పొందిన జవాన్ల ఆత్మ శాంతించాలని విద్యార్థులతో కలిసి ఆయన అంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, వీరజవాన్లపై ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు. -
దాశరథికి ఘన నివాళి
కీసర: నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన తెలంగాణ పోరాట యోధుడు, ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలను నాగారం గ్రామంలోని సెరినిటీ పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. పాఠశాల డైరెక్టర్ నోముల జంగారెడ్డి, కార్యదర్శి వసంత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మహాత్ముడికి వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి
హైదరాబాద్ : జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి వైఎస్ఆర్ సీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయచందర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల నివాళి
-
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల నివాళి
ఇడుపులపాయ : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు వైఎస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నివాళులు అర్పించినవారిలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ సుధాకర్ రెడ్డి, వైఎస్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
మహానేతకు వైఎస్ఆర్ సీపీ ఘన నివాళులు
-
మహానేతకు వైఎస్ఆర్ సీపీ ఘన నివాళులు
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి బయలుదేరి ఆ తర్వాత అసెంబ్లీ, శాసనమండలికి నేతలు వెళ్లనున్నారు. కాగా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి, ప్రార్థనలు చేశారు. ఇవాళ రాత్రి అక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి గురువారం ఉదయానికి హైదరాబాద్కు చేరుకుంటారు.