'అవిశ్వాసంపై చర్చ తర్వాతే బడ్జెట్పై చర్చ' | why ysrcp going back on notice issue: yanamala | Sakshi
Sakshi News home page

'అవిశ్వాసంపై చర్చ తర్వాతే బడ్జెట్పై చర్చ'

Mar 15 2016 1:54 PM | Updated on Aug 27 2018 8:44 PM

'అవిశ్వాసంపై చర్చ తర్వాతే బడ్జెట్పై చర్చ' - Sakshi

'అవిశ్వాసంపై చర్చ తర్వాతే బడ్జెట్పై చర్చ'

ప్రతిసారి నోటీసులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లిపోతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

హైదరాబాద్: ప్రతిసారి నోటీసులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లిపోతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నేడే చర్చిద్దామని అన్నారు.

దీనికి వైఎస్ఆర్ సీపీ అభ్యంతరం చెప్పగా అది సరికాదని యనమల అన్నారు. స్పీకర్ పై నోటీసు ఇచ్చిన తర్వాత సభను స్పీకర్ నడిపించాలని అనుకోవడం లేదని, ముందు దానిపై చర్చించిన తర్వాతే బడ్జెట్ పై చర్చ ఉంటుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement