విజయనగరం జెడ్పీకి కేంద్ర పురస్కారం | The award toVizianagaram ZP | Sakshi
Sakshi News home page

విజయనగరం జెడ్పీకి కేంద్ర పురస్కారం

Apr 19 2016 1:18 AM | Updated on Aug 15 2018 6:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా పరిషత్‌తోపాటు నాలుగు మండలాలు, ఆరు గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలకు ఎంపికయ్యాయి.

 ఈ నెల 24న జంషెడ్‌పూర్‌లో అందజేయనున్న ప్రధాని మోదీ
 
 సాక్షి, హైదరాబాద్, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా పరిషత్‌తోపాటు నాలుగు మండలాలు, ఆరు గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలకు ఎంపికయ్యాయి. 2014-15 ఏడాదికి గాను దేశంలో జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు ప్రకటించిన పురస్కారాల్లో భాగంగా ఏపీలో పలు స్థానిక సంస్థలకు ఈ గౌరవం దక్కింది.

పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్(పీఎస్‌పీ), రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్ (ఆర్‌జీజీఎస్‌పీ) అవార్డులను ఈ నెల 24న పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా జంషెడ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement