180 కోట్లతో తాత్కాలిక సచివాలయం | temporary secretariat notification released by CRDA | Sakshi
Sakshi News home page

180 కోట్లతో తాత్కాలిక సచివాలయం

Jan 15 2016 8:06 AM | Updated on Sep 3 2017 3:44 PM

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 180 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా మంగళగిరి మండంలోని వెలగపుడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేయాలని ప్రకటించింది. సెప్టెంబర్ కల్లా నిర్మాణం పూర్తి చేయాలని నిబంధనలను విధించింది. సుమారు 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. 26 ఎకరాల స్థలంలో ఏపీ తాత్కాలిక సచివాయలం నిర్మించనున్నట్లు సీఆర్డీఏ బృందం వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement