తొలి విడతలో 500 గ్రామాల్లో ఏర్పాటుకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వైకుంఠధామాల(శ్మశానవాటిక)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకుగాను ఉపాధిహామీ పథకం నిధులు వెచ్చించాలని నిర్ణయిచింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి విడతలో 500 గ్రామాల్లో వైకుంఠ థామాల ఏర్పాటుకు గ్రామీణాబివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తంగా తొలివిడతలో మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో వైకుంఠధామాల ఏర్పాటు నిమిత్తం మార్గదర్శకాలను సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. ఉపాధిహామీ చట్టంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కింద ఈ పనులను చేపట్టేందుకు వెసులుబాటు ఉందని ఆమె పేర్కొన్నారు.వైకుంఠధామాలకు ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనావేశారు. అయితే, ఆయా గ్రామాల్లో జనాభాను బట్టి అంచనాల్లో కొంత మేరకు హెచ్చుతగ్గులు ఉండే వచ్చు. ఏదేని గ్రామంలో దాతలు ముందుకు వచ్చినట్లయితే, వైకుంఠ ధామం ఏర్పాటుకు రూ.5 లక్షలు లేదా వ్యయంలో 25 శాతం (ఏది ఎక్కువైతే అది) ఇచ్చినవారి పెద్దల లేదా తల్లిదండ్రుల స్మారకంగా పేరును పెట్టనున్నారు.
వైకుంఠ ధామం ఎలాగంటే..
ఒక్కో వైకుంఠధామంలో రెండు దహన వేదికలు, ఒక స్టోర్రూమ్, సందర్శకులకు షెడ్, రెండు మరుగుదొడ్లు, సింటెక్స్ ఓవర్హెడ్ ట్యాంక్, సోలార్లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు భూమి అభివృద్ధి, హద్దుల ఏర్పాటు పనులను ఉపాధిహామీ కింద వేరుగా చేపట్టనున్నారు. నీటి సరఫరా, ప్రహరీ, ఇతర పనులను గ్రామ పంచాయతీ లేదా ఇతర నిధులతో పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. స్థలం ఎంపిక నిమిత్తం రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని, గ్రామసభ ఆమోదం లభించాక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలను సిద్ధం చేయించాలని ఉపాధిహామీ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
‘ఉపాధి’ నిధులతో ‘వైకుంఠధామాలు’
Published Mon, Mar 27 2017 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement