భారీ వర్షాలు, వరద నష్టంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక నివేదిక తయారు చేసింది.
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరద నష్టంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక నివేదిక తయారు చేసింది. 6 జిల్లాలు, 96 మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. వర్షాలు, వరదలతో ఆరుగురు మృతి చెందగా, ఒకరు గల్లంతు అయినట్లు వెల్లడించింది. అలాగే 43 వేల 239 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో సుమారు 30వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తెలిపింది. భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.