'కేసీఆర్ సెక్యులర్ అని ప్రూవ్ చేసుకున్నారు' | Telangana CM K. Chandrashekar Rao is a real secular leader, says Mohammed Mahmood Ali | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ సెక్యులర్ అని ప్రూవ్ చేసుకున్నారు'

Jun 8 2014 12:52 PM | Updated on Sep 6 2018 3:01 PM

'కేసీఆర్ సెక్యులర్ అని ప్రూవ్ చేసుకున్నారు' - Sakshi

'కేసీఆర్ సెక్యులర్ అని ప్రూవ్ చేసుకున్నారు'

తెలంగాణలో ప్రభుత్వ స్థలాల సర్వేను ఏడాదిలోగా పూర్తి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ స్ఫష్టం చేశారు.

తెలంగాణలో ప్రభుత్వ స్థలాల సర్వేను ఏడాదిలోగా పూర్తి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ స్ఫష్టం చేశారు. ఆక్రమాలు, అన్యాక్రాంతమైన భూమును స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆదివారం హైదరబాద్ సచివాలయంలో రెవెన్యూ శాఖ, డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టారు.

 

అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహమూద్ ఆలీ మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ అభివృద్ధీ తన బాధ్యత అని వెల్లడించారు. మైనార్టీ అయిన తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్యులర్గా నిరూపించుకున్నారని మహమూద్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement