'ఓటర్లను మభ్యపెడుతున్న టీఆర్ఎస్' | TDP Leader Ravula Chandrasekhar Reddy takes on TRS party leaders | Sakshi
Sakshi News home page

'ఓటర్లను మభ్యపెడుతున్న టీఆర్ఎస్'

Dec 31 2015 2:38 PM | Updated on Sep 3 2017 2:53 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్లోని ఓటర్లను మభ్యపెట్టేలా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్లోని ఓటర్లను మభ్యపెట్టేలా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని టీడీపీ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. అందులోభాగంగానే విద్యుత్, వాటర్ బిల్లు బకాయిలు రద్దు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుందని రావుల గురువారం హైదరాబాద్లో విమర్శించారు.

ఓటర్లను ఆశపెట్టి ఆకట్టుకుంటున్నారని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులపై రావుల చంద్రశేఖరరెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలనలో ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మస్కబారిందని రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement