పీఎస్లో లొంగిపోయిన పోకిరీ కార్పొరేటర్ | tdp corporator gummadi venkateswara rao surrendered in shamshabad police | Sakshi
Sakshi News home page

పీఎస్లో లొంగిపోయిన పోకిరీ కార్పొరేటర్

May 20 2016 10:14 AM | Updated on Jul 23 2018 8:49 PM

పీఎస్లో లొంగిపోయిన పోకిరీ కార్పొరేటర్ - Sakshi

పీఎస్లో లొంగిపోయిన పోకిరీ కార్పొరేటర్

ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు శుక్రవారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

హైదరాబాద్: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు శుక్రవారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని శంషాబాద్ పోలీసులు చంటిబాబును ఇదివరకే కోరిన విషయం తెలిసిందే. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని చంటిబాబు విజ్ఞప్తి చేశాడు. ఇక అరెస్టు తప్పదని భావించిన ఈ పోకిరీ కార్పోరేటర్ చివరికి లొంగిపోయినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఎయిరిండియా విమానంలో ప్రయానిస్తున్న సమయంలో ఆమె పక్క సీట్లో కూర్చున్న ఉమ్మడి వెంకటేశ్వరరావు కాలితో పదేపదే తాకి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement