మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు.
ప్రిన్సిపల్ వేధింపుల వల్లే..
Apr 10 2017 1:08 PM | Updated on Sep 5 2017 8:26 AM
హైదరాబాద్: మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ డాక్టర్ కమలాదేవి వేధింపుల వల్లే రెండు రోజుల క్రితం కళాశాల లెక్చరర్ అర్జున్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని.. వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
Advertisement


