ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం

ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం - Sakshi


శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ప్రయాణికుల నుంచి  కస్టమ్స్ అధికారులు మంగళవారం 1.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్న క్రమంలో... సదరు ప్రయాణికుల లగేజీలో ఆ బంగారాన్ని కనుగొన్నారు. కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top