ఏపీ పోలీసుల తీరుపై పీసీఐ తీవ్ర ఆందోళన | Press Council of India issues notice to ap government,DGP, Guntur sp | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసుల తీరుపై పీసీఐ తీవ్ర ఆందోళన

Mar 23 2016 8:22 PM | Updated on Aug 20 2018 8:20 PM

ఏపీ పోలీసుల తీరుపై పీసీఐ తీవ్ర ఆందోళన - Sakshi

ఏపీ పోలీసుల తీరుపై పీసీఐ తీవ్ర ఆందోళన

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాక్షి దినపత్రికలో ప్రచురించిన ...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాక్షి దినపత్రికలో ప్రచురించిన ఏపీ రాజధాని అమరావతి భూ దందా కథనాలపై ...ఆ పత్రిక రిపోర్టర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించడాన్ని పీసీఐ బుధవారం తప్పుబట్టింది. ఆధారాలు బయటపెట్టాలనడం పత్రికా స్వేచ్ఛకు భంగకరమని పీసీఐ వ్యాఖ్యానించింది.  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారాన్ని సుమెటో కేసుగా తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement