ఆయుష్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

ఆయుష్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఈ నెల 29 వరకు గడువు  

 

సాక్షి, హైదరాబాద్‌: ఆయుష్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 2017–18 వైద్య విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.



నీట్‌– 2017లో అర్హత సాధించిన అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులను గురువారం ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని రిజిస్ట్రార్‌ తెలిపారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top