-
ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
ఆన్లైన్ దరఖాస్తుకు ఈ నెల 29 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2017–18 వైద్య విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నీట్– 2017లో అర్హత సాధించిన అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులను గురువారం ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు. -
నేడు ఎంబీబీఎస్ స్పాట్ కౌన్సెలింగ్
- ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ సీట్ల భర్తీ - పూర్తిగా నిండిన ‘బి’ కేటగిరీ సీట్లు -‘సి’ కేటగిరీలో 50 సీట్లు ఖాళీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మంగళవారం మాప్– అప్ (స్పాట్) కౌన్సెలింగ్ జరగనుంది. ఇందుకోసం వెబ్ ఆప్షన్లకు అవకాశమి స్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్లో తెలిపింది. ఆగస్టు 29న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. స్పాట్ కౌన్సె లింగ్కు అర్హులైన వారి మెరిట్ జాబితాను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. గత రెండు కౌన్సె లింగ్లలో సీటు పొంది, జాయిన్ కాని వారికి ఈ కౌన్సెలింగ్లో అవకాశం ఉండదు. ఇప్పటికే బీడీఎస్ సీటు పొందిన వారు మాత్రం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకో వచ్చు. కాగా, ఇతర రాష్ట్రాల్లో సీటు పొంది తాజాగా ఇక్కడి కాలేజీల్లో వెబ్ ఆప్షను ఇస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఎంసీఐకి నివేదిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ‘సి’ కేటగిరీలో 50 సీట్లు ఖాళీ.. రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రైవేటు మైనార్టీ కాలేజీల్లో ‘బి’ కేటగిరీ సీట్లు పూర్తిగా భర్తీ కాగా, ‘సి’ కేటగిరీలో 50 సీట్లు మిగిలాయి. ప్రతిమ కాలేజీలో 23, మహే శ్వర కాలేజీలో 21, ఎంఎన్ఆర్ కాలేజీలో 4, చల్మెడ కాలేజీలో ఒక సీటు ఖాళీగా ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం కాళోజీ వర్సిటీ ఇప్పటికే రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించింది. రెండో కౌన్సెలింగ్ తర్వాత ‘బి’ కేటగిరీ సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అన్ని కేటగిరీల ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆగస్టు 31లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భారత వైద్య మండలి నిర్ణయించింది. దీంతో ‘బి’ కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ అవకాశాన్ని ప్రైవేటు కాలేజీలకు ఇచ్చింది. ఆయా కాలేజీలో గడువులోపే సీట్లను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 3న బీడీఎస్కు.. రెండో కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ బీడీఎస్ సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3 లేదా 4 తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. -
అయోమయంలో ఆయుర్వేద విద్య
- అడ్మిషన్లపై ఇప్పటికీ రాని స్పష్టత - ఇంకా విడుదలకాని మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసింది. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 500 సీట్లు మిగిలిపోయాయి. ఆగస్టు 10 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ మొదలుకానుంది. అయితే సంప్రదాయ వైద్య విద్య కోర్సుల సీట్ల భర్తీ విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్ హెల్త్ కోర్సుల్లో కలిపి రాష్ట్రంలో 695 సీట్లు ఉన్నాయి. ఈ నాలుగు రకాల కోర్సులకు కలిపి రాష్ట్రంలో 10 కాలేజీలు ఉన్నాయి. న్యాచురోపతి–యోగిక్ కోర్సును అందించే కాలేజీ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది. ఈ కాలేజీలోని 30 సీట్లలో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉమ్మడిగా ప్రవేశాలు కల్పించేలా నిబంధనలు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల భర్తీ తర్వాత ఆయుర్వేద, హోమి యోపతి, యునానీ, న్యాచురోపతి –యోగిక్ కోర్సుల్లో వార్షిక ఫీజు గతేడాది ప్రకారం ‘ఎ’ కేటగిరీకి రూ.21 వేలు, ‘బి’ కేటగిరీకి రూ.50 వేలు, ‘సి’ కేటగిరీకి రూ.1.25 లక్షలు గా ఉంది. నీట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి కేటగిరీల వారీగా సీట్లకు ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రభుత్వం మార్గ దర్శకాలు ఖరారు చేశాక కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసినా ఇప్పటికీ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేయలేదు. దీంతో కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఇంకా ఏర్పాట్లు చేయట్లేదు. -
కనీసం సొంత భవనం లేదు!
ఇదీ కాళోజీ ఆరోగ్య వర్సిటీ దుస్థితి - వర్సిటీ ఏర్పాటై మూడేళ్లయినా.. నిలువ నీడ లేదు - కాకతీయ వర్సిటీకి చెందిన పాత భవనంలోనే పాలన సాక్షి, హైదరాబాద్: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్సిటీ ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సొంత భవనం లేని పరిస్థితి నెలకొంది. వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలకు చెందిన ఓ పాత భవనంలోనే వర్సిటీ పాలన నడుస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల సీట్ల భర్తీకి జూలై 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వరంగల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు కాళోజీ వర్సిటీలో స్థలం లేక కాకతీయ వర్సిటీలో నిర్వహిస్తున్నారు. స్వయంగా ఆరోగ్య విశ్వవిద్యాలయంలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే వ్యవస్థ, వసతి లేకపోవడంతో వర్సిటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. రూ.45 కోట్లతో భవనం నిర్మాణానికి ప్రణాళిక ఉమ్మడి ఏపీలో వైద్య విద్య నిర్వహణ కోసం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వైద్య విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వరంగల్లో కాళోజీ నారాయణరావు పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీ పరిపాలన, ఇతర అవసరాల కోసం భవనాలను నిర్మించేందుకు రూ.130 కోట్లను కేటాయించింది. అందులో రూ.45 కోట్లతో పరిపాలన భవనం నిర్మించేలా ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వరంగల్ సెంట్రల్ జైలుకు చెందిన స్థలంలో భవనం నిర్మించేలా ప్రభుత్వం అనుమతులూ ఇచ్చింది. పరిపాలన భవనం నిర్మాణం కోసం 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ గజ్వేల్లో శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పరిపాలన భవనం నిర్మాణం బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ ఐడీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. టీఎస్ఎంస్ఐడీసీ ఆలస్యంగా టెండరు ప్రక్రియ మొదలు పెట్టింది. రూ.20 కోట్లతో భవనాన్ని నిర్మించేలా కొత్త ప్లాన్ రూపొందిం చింది. ఇంకా టెండరు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. -
450 ఎంబీబీఎస్ సీట్ల కోత!
- అన్ని సీట్లూ కన్వీనర్ ఆధ్వర్యంలోనే భర్తీ - వారంలో ప్రవేశాలకు మార్గదర్శకాలు - అనంతరం షెడ్యూల్ విడుదల ఈ సారి అందుబాటులో ఉన్న సీట్లు 3,250 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీడీఎస్ సీట్లు 1,140 అనుమతులు రాని కాలేజీలు 3 తొలిసారిగా ఉమ్మడి ప్రవేశాలు సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) ర్యాంకులు వెల్లడైన నేపథ్యంలో వైద్య విద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రస్థాయిలో నీట్ ర్యాంకులను వెల్లడించిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, వైద్య విద్య డైరెక్టరేట్లు... ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్ల భర్తీ ప్రక్రియ షెడ్యూల్ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. 2017–18 విద్యా సంత్సరంలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాలు, ఫీజులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. అవి రాగానే ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ‘నీట్’ ఆధారంగానే.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఈసారి పూర్తిగా మారిపోనుంది. గత విద్యా సంవత్సరం వరకు.. ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేసేవారు. ఇక ప్రైవేట్ కాలేజీల్లోని మరో 35 శాతం సీట్లను వైద్య విద్య కాలేజీల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో భర్తీ చేసేవారు. మిగతా 15 శాతం (ఎన్నారై కోటా) సీట్లను ఆయా కళాశాలలు నేరుగా భర్తీ చేసుకునేవి. అదే తాజా విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ వైద్య కళాశాలల్లోని అన్ని కోటాల ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లను.. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. 450 సీట్లకు కోత! రాష్ట్రంలో ప్రస్తుతం 3,250 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఏడు ప్రభుత్వ కాలేజీల్లో 1,100 సీట్లు.. 15 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో కలిపి 2,150 సీట్లు ఉన్నాయి. గతేడాది మొత్తం 3,700 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో ఈ ఏడాదికి 450 సీట్ల కోత పడినట్లు వైద్య విద్య డైరెక్టరేట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 150 చొప్పున సీట్లున్న మహవీర్, ఆర్వీఎం, మల్లారెడ్డి మహిళా కాలేజీలకు ఇంకా అనుమతులు రాలేదని వెల్లడించాయి. అలాగే బీడీఎస్ కోర్సులో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మార్గదర్శకాలు రాగానే.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా మార్గదర్శకాలు ఖరారు చేస్తుంది. ఈసారి ఉమ్మడి ప్రవేశాలు జరుపుతున్న నేపథ్యంలో మార్గదర్శకాల్లో భారీగా మార్పులు ఉండే అవకాశముందని సమాచారం. ప్రభుత్వం గతేడాది ప్రైవేటు కాలేజీల్లోని సీట్ల వార్షిక ఫీజులను పెంచింది. కన్వీనర్ కోటాలోని 50 శాతం సీట్లకు రూ.60 వేలుగా, యాజమాన్య కోటాలో భర్తీ చేసే 35 శాతం సీట్లకు రూ.11 లక్షలుగా నిర్ణయించి.. ఎన్నారై కోటా సీట్ల ఫీజు యాజమాన్య కోటా ఫీజుకు రెట్టింపు ఉంటుందని ప్రకటించింది. మైనారిటీ కాలేజీల్లో ఈ ఫీజులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇక గతేడాది బీడీఎస్ కోర్సులో కన్వీనర్ కోటాకు రూ.45వేలు, యాజమాన్య కోటాకు రూ.4 లక్షలు, ఎన్నారై కోటాకు రూ.5 లక్షల ఫీజు నిర్ణయించారు. ఇలా గతేడాదే ఫీజు పెంచిన నేపథ్యంలో.. ఈసారి పెంపు ఉంటుందా లేదా అనేది మార్గదర్శకాల్లో తేలనుంది. ఇంతకాలం ఎన్నారై కోటా ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కాలేజీలు ఉమ్మడి ప్రవేశాల నేపథ్యంలో ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement