అయోమయంలో ఆయుర్వేద విద్య | Ayurvedic education in confusion | Sakshi
Sakshi News home page

అయోమయంలో ఆయుర్వేద విద్య

Aug 6 2017 1:58 AM | Updated on Sep 17 2017 5:12 PM

అయోమయంలో ఆయుర్వేద విద్య

అయోమయంలో ఆయుర్వేద విద్య

ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల మొదటి దశ కౌన్సెలింగ్‌ ముగిసింది. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 500 సీట్లు మిగిలిపోయాయి.

- అడ్మిషన్లపై ఇప్పటికీ రాని స్పష్టత
ఇంకా విడుదలకాని మార్గదర్శకాలు
 
సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల మొదటి దశ కౌన్సెలింగ్‌ ముగిసింది. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 500 సీట్లు మిగిలిపోయాయి. ఆగస్టు 10 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. అయితే సంప్రదాయ వైద్య విద్య కోర్సుల సీట్ల భర్తీ విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ కోర్సుల్లో కలిపి రాష్ట్రంలో 695 సీట్లు ఉన్నాయి. ఈ నాలుగు రకాల కోర్సులకు కలిపి రాష్ట్రంలో 10 కాలేజీలు ఉన్నాయి. న్యాచురోపతి–యోగిక్‌ కోర్సును అందించే కాలేజీ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది.

ఈ కాలేజీలోని 30 సీట్లలో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉమ్మడిగా ప్రవేశాలు కల్పించేలా నిబంధనలు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల భర్తీ తర్వాత ఆయుర్వేద, హోమి యోపతి, యునానీ, న్యాచురోపతి –యోగిక్‌ కోర్సుల్లో వార్షిక ఫీజు గతేడాది ప్రకారం ‘ఎ’ కేటగిరీకి రూ.21 వేలు, ‘బి’ కేటగిరీకి రూ.50 వేలు, ‘సి’ కేటగిరీకి రూ.1.25 లక్షలు గా ఉంది. నీట్‌ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి కేటగిరీల వారీగా సీట్లకు ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రభుత్వం మార్గ దర్శకాలు ఖరారు చేశాక కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ ముగిసినా ఇప్పటికీ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేయలేదు. దీంతో కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఇంకా ఏర్పాట్లు చేయట్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement