కొన్ని రోజులుగా నగరంలో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు.
కొన్ని రోజులుగా నగరంలో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. నగలు మెరుగు పెడతామంటూ జనాన్ని మభ్యపెట్టి ఆపై నగలతో మాయమవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీ బంగారంతోపాటు నాలుగు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై తెలంగాణ, మహారాష్ట్రల్లో 25 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.