‘గుత్తా పార్టీ మారితే పరువు పోతుంది’ | komatireddy venkat reddy fires on gutha sukender reddy | Sakshi
Sakshi News home page

‘గుత్తా పార్టీ మారితే పరువు పోతుంది’

Jun 9 2016 3:25 AM | Updated on Sep 4 2017 2:00 AM

‘గుత్తా పార్టీ మారితే పరువు పోతుంది’

‘గుత్తా పార్టీ మారితే పరువు పోతుంది’

ఇప్పటికే మూడు పార్టీలు మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి పార్టీ మారి పరువును పోగొట్టుకోవద్దని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సూచించారు.

సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే మూడు పార్టీలు మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి పార్టీ మారి పరువును పోగొట్టుకోవద్దని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ పార్టీ మారుతారని తాము అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ మెట్లు ఎక్కకున్నా, పార్టీ సభ్యత్వం లేకున్నా సోనియాగాంధీ చలువతో రెండుసార్లు ఎంపీ అయ్యాడన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోవడం లేదని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఒకే విడతలో రుణమాఫీని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకోసం రూ. 300 కోట్లు ఖర్చుచేయడం అవసరమా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement