
రైట్ రాయల్గా కొనుక్కున్నా: కేకే
ఇబ్రహీంపట్నంలో భూమికి సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాతే రైట్ రాయల్గా కొనుక్కున్నానని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు చెప్పారు.
ఆ భూమిని 2011లో కొన్నానని, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని, టీఆర్ఎస్కు సంబంధం లేదని చెప్పారు. శంషాబాద్లో భూమి కొన్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని, అక్కడ ఒక్క సెంటు కూడాలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిందేమీ లేదని, ఆ భూమి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేకే అన్నారు.