హజ్‌ యాత్రికులు 12 నుంచి మదీనాకు ప్రయాణం | Haj pilgrims travel to Madinah from 12th | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులు 12 నుంచి మదీనాకు ప్రయాణం

Sep 12 2017 12:16 AM | Updated on Sep 19 2017 4:22 PM

తెలంగాణ నుంచి హజ్‌ కమిటీ ద్వారా ఎంపికైన హజ్‌ యాత్రికులు ఈ నెల 12 నుంచి మదీనా నగరానికి వెళ్తున్నట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్‌ సోమవారం తెలిపారు.

హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్‌  
 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి హజ్‌ కమిటీ ద్వారా ఎంపికైన హజ్‌ యాత్రికులు ఈ నెల 12 నుంచి మదీనా నగరానికి వెళ్తున్నట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్‌ సోమవారం తెలిపారు. హజ్‌ ఆరాధనల్లో భాగంగా మదీనాకు వెళ్తున్నట్లు చెప్పారు. 10 రోజులపాటు మదీనాలోని మస్జీదే నబవీలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు చెప్పారు.

ఇక్కడి నుంచి మక్కా నగరానికి ఎలా వెళ్లారో అదే పద్ధతిలో మక్కా నుంచి గ్రూప్‌ల వారీగా మదీనాకి వెళ్తారన్నారు. అనంతరం ఈ నెల 21 నుంచి నగరానికి తిరుగు ప్రయాణం అవుతారన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement