తాజ్ కృష్ణా గోల్డ్ ఎగ్జిబిషన్ లో ఐదు తులాల బంగారు నగలు, ఓ వజ్రం మాయమయ్యాయి.
హైదరాబాద్: నగరంలో ఘరానా దొంగతనం జరిగింది. తాజ్ కృష్ణా గోల్డ్ ఎగ్జిబిషన్ లో ఐదు తులాల బంగారు నగలు, ఓ వజ్రం మాయమయ్యాయి. వీటి విలువ దాదాపు 20 లక్షల రూపాయిలు ఉంటుందని అంచనా. నగలు మాయమైన విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.