
మోగెరా నగారా!
సమర భేరి మోగింది. మహా సమరానికి తెర లేచింది. ఎత్తులు...పై ఎత్తుల కసరత్తు మొదలైంది. కొత్త పొత్తులు... విమర్శల కత్తులు సిద్ధమవుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన విడుదల
ఫిబ్రవరి 2న పోలింగ్
సమర భేరి మోగింది. మహా సమరానికి తెర లేచింది. ఎత్తులు...పై ఎత్తుల కసరత్తు మొదలైంది. కొత్త పొత్తులు... విమర్శల కత్తులు సిద్ధమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమరాంగణ ప్రాంగణంలో తల పడేందుకు అధికార... ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ‘మహా’బలుడెవరో తేల్చుకోవాలని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార పగ్గాలను అందించే బ్రహ్మాస్త్రాల కోసం అన్వేషిస్తున్నాయి. కులమో... గుణమో... ధనమో...ఏదో ఒక ఆకర్షణ మంత్రం... అధికారమే లక్ష్యం. ఈసారి అతివలూ అధికార పీఠం కోసం బరిలో దిగుతున్నారు. పాలనా పగ్గాలు ఎవరు చేపట్టాలనే అంశంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.
పోలింగ్ కేంద్రాలు : 7,757
పోలింగ్ లొకేషన్లు: 3,117
500 కంటే తక్కువ ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు: 165
500-1000 మధ్య ఓట్లున్నవి: 4,752
1000-1250 ఓట్లు ఉన్నవి: 2,318
1250 కంటే ఎక్కువ ఉన్నవి: 522
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 1987
అత్యంత సమస్యాత్మకమైనవి: 867
పోలింగ్ సిబ్బంది : 46, 545 మంది
ప్రిసైడింగ్ అధికారులు : 7,757
అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు: 7,757
ఇతర పోలింగ్ అధికారులు: 23,271 (ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు)
రిజర్వులోని పోలింగ్ సిబ్బంది: 7,760
150 వార్డులకు సంబంధించిన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ హాళ్ల సంఖ్య : 24