బాధ్యతలు స్వీకరించిన డీఏవోలు | DAOs offcers joining duty | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన డీఏవోలు

Oct 13 2016 1:17 AM | Updated on Oct 17 2018 3:38 PM

బాధ్యతలు  స్వీకరించిన డీఏవోలు - Sakshi

బాధ్యతలు స్వీకరించిన డీఏవోలు

మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను మినహాయించి మిగిలిన కొత్త జిల్లాల్లో జిల్లా వ్యవసాయాధికారుల

 సాక్షి, హైదరాబాద్: మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను మినహాయించి మిగిలిన కొత్త జిల్లాల్లో జిల్లా వ్యవసాయాధికారుల (డీఏవో)ను వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి నియమించారు. వారంతా మంగళవారం బాధ్యతలు స్వీకరించారని ఆ శాఖ వర్గా లు తెలిపాయి. పాత కొత్త జిల్లాల డీఏవోలుగా సీహెచ్ తేజోవతి (కరీంనగర్), జె.భాగ్యలక్ష్మి (జగిత్యాల), ఆర్.తిరుమల ప్రసాద్ (పెద్దపల్లి), జయదేవి (సిరిసిల్ల), కె.ఎన్.జగదీష్ (రంగారెడ్డి), గోపాల్ (వికారాబాద్), విజయ్‌కుమార్ (కామారెడ్డి), విజయగౌరి (నిజామాబాద్), సుచరిత (మహబూబ్‌నగర్), బి.సింగారెడ్డి (నాగర్‌కర్నూల్), జె.సి.నాగేంద్రయ్య (వనపర్తి), కె.గోవింద్ నాయక్ (గద్వాల), ఝాన్సీలక్ష్మీకుమారి (ఖమ్మం), పి.ప్రతాప్ (కొత్తగూడెం), బి.నర్సింహారావు (నల్లగొండ), యు.జ్యోతిర్మయి (సూర్యాపేట), పి.హరి నాథ్‌బాబు (యాదాద్రి), ఆశాకుమారి (ఆదిలాబాద్), జె.దాదారావు (మంచిర్యాల), కె.గంగారాం (నిర్మల్), అలీముద్దీన్ (ఆసిఫాబాద్), జి.రాములు (మెదక్), ఏఎం.శ్రీలత (సంగారెడ్డి), ఎం.గోవిందు (సిద్దిపేట), డి.ఉషా (వరంగల్ రూరల్), కె.అనురాధ (జయశంకర్), ఎన్.వీరునాయక్ (జనగాం), బి.చత్రు (మహబూబాబాద్)లను నియమించారు. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ఉన్నందున ఆ జిల్లాలకు ఏడీఏ స్థాయి అధికారిని నియమిస్తారు. ఇదిలావుండగా ఉద్యాన, పశు సంవర్థకశాఖ జిల్లా అధికారులు కూడా జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement