 
															'2018 ఆగస్ట్ నాటికి మెట్రో పూర్తి చేయాలి'
మెట్రో రైలు ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
	హైదరాబాద్ : 2018 ఆగస్ట్ నాటికి మొత్తం మెట్రో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 2017 నవంబర్ నాటికి మియాపూర్ - ఎల్బీనగర్ పనులు పూర్తి చేయాలన్నారు.
	
	మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ  సమీక్షాసమావేశానికి మెట్రో, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
