సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. ఊళ్లకు వెళ్లేవాళ్లతో సిటీ చౌరస్తాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్ చౌరస్తా రాత్రిపూట చూస్తుంటే అక్కడేదో భారీ జాతర జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి పనామా గోడౌన్స్ వరకు ఉన్న దారి మొత్తం బస్సులు, వాటి కోసం వేచి చూసే ప్రయాణికులతో నిండిపోతోంది. మంగళవారం నుంచి పలు కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో అనుకోకుండా ప్రయాణాలు చేసేవాళ్లు సోమవారం రాత్రి మూట ముల్లె సర్దుకుని బస్సుల కోసం బయల్దేరారు. నిజానికి కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు సెలవులు ఎప్పటినుంచి ఇస్తామన్న విషయాన్ని ముందు ప్రకటించకుండా.. చివరి నిమిషంలో విద్యార్థులకు చెప్పడంతో.. వాళ్ల తల్లిదండ్రులు ముందు నుంచి పండగకు ఊళ్లు వెళ్లడానికి ప్లాన్ చేసుకునే వీలు లేకుండా పోయింది.
దాంతో.. అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని ఊళ్లు వెళ్లేందుకు వచ్చినవాళ్లతో ఎల్బీనగర్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు అక్కడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉన్న పనామా గోడౌన్స్ వరకు నిలిచి ఉంటున్నాయి. అటువైపు వెళ్లాల్సిన సిటీబస్సులు మిగిలిన కొద్దిపాటి రోడ్డులోనే వెళ్లాల్సి రావడంతో.. అక్కడంతా ట్రాఫిక్ జాం అవుతోంది. ఆర్టీసీ కంట్రోలర్లు ఒకవైపు వెళ్లాల్సిన బస్సులన్నింటినీ ఒకో ప్రాంతంలో పార్కింగ్ చేయిస్తూ, ప్రయాణికులకు కూడా వాటి వివరాలు చెబుతూ హడావుడిగా కనిపిస్తున్నారు.
ప్రయాణికులు మాత్రం సరిపడగా బస్సులు లేవని, ఉన్నవి కూడా అన్నీ స్పెషల్ బస్సులే కావడంతో చార్జీలు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని వాపోతున్నారు. ప్రైవేటు బస్సుల్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏలూరుకు 500-600 వరకు మామూలు బస్సు చార్జి ఉండేది. అలాంటిది ఇప్పుడు కనీసం వెయ్యి రూపాయల నుంచి టికెట్లు మొదలవుతున్నాయి. అయినా సరే, పెద్దపండగ వస్తోంది కాబట్టి సొంతూళ్లకు వెళ్లాలని అంటున్నారు.
ఎల్బీ నగర్ టు పనామా.. బస్సులే బస్సులు!
Published Tue, Jan 12 2016 2:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement